Saturday, June 27, 2026
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJU1/70 చట్టం అమలుపై టిడిపి నేతల స్పష్టమైన హామీ

1/70 చట్టం అమలుపై టిడిపి నేతల స్పష్టమైన హామీ

-

అల్లూరి జిల్లా కేంద్రంలోని కిడారి క్యాంప్ కార్యాలయంలో టిడిపి నేతలు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచులు బాకూరు వెంకటరమణ రాజు, పాంగి పాండురంగ స్వామి, తామర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు.

డివిజన్ నాయకుడు, దారేల సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఆదివాసీలను మోసపుచ్చేందుకు ప్రలోభాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు వాటికి లొంగకుండా తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు భంగం కలిగించే ఏ నిర్ణయమైనా తీసుకుంటే తాము పదవులకు రాజీనామా చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

బాకూరు సర్పంచ్ బాకూరు వెంకటరమణ రాజు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణ టిడిపి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటుందని తెలిపారు. 1/70 చట్టాన్ని ఉల్లంఘించే యత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ భూములపై హక్కులను రక్షించుకోవడానికి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెదబయలు మండల మహిళా అద్యక్షురాలు కిముడు మహేశ్వరి, శివ సాగర్, ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణ, భూ సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిగాయి. టిడిపి పార్టీ ఆదివాసీల భద్రతకు కట్టుబడి ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp