Saturday, June 27, 2026
HomeNationalబెంగాల్‌ కా టైగర్...సీఎం సువేందు అధికారి

బెంగాల్‌ కా టైగర్…సీఎం సువేందు అధికారి

-

West Bengal CM: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి(Suvendu Adhikari) ఎంపికైనట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం మే 9న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవనున్నట్లు సమాచారం. సువేందుతో పాటు మరో ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సువేందు అధికారి గణనీయమైన పాత్రను పోషించారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించిన ఆయన, తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో కూడా దీదీపై విజయం సాధించారు.

మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 207 సీట్లు గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమైంది. ఈ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చారిత్రక ఆధిక్యం సాధించినట్లైంది.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp