Saturday, June 27, 2026
HomeAndhra Pradeshవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

-

ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు CITU,DYFI,KVPS, ఐద్వా మహిళా సంఘాల ఆధ్వర్యంలో

ఈరోజు ఉదయం బద్వేల్ పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు నందు ఉన్న గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని లు మాట్లాడుతూ….. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పైన కడప ఉక్కు పైన తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నారు.

నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ను నేడు నష్టాలు వస్తున్నయన్న సాకుతో కార్పొరేటు శక్తులకు అమ్మే ప్రయత్నం వంటి కుటిల ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది అన్నారు.

నాడు ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కు నేడు ప్రాణాలర్పించైనా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే విభజన హామీలను చట్టబద్ధంగా రాసుకున్న కడప ఉక్కుని సైతం కేంద్రం పక్షపాత ధోరణితో చూస్తూ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో కరువుతో ఒకవైపు అల్లాడుతుంటే వలసలతో అల్లడిపోతుంటే పాలకులకు కనపడటం లేదన్నారు. వలసలకు నివారణకు కడప ఉక్కు పరిశ్రమే ఏకైక మార్గం అన్నారు. ఇక్కడ చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలసలు పోతున్నారు అన్నారు. అదే ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే చదువుకున్న యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని లేకుంటే రాబోవు రోజులలో విద్యార్థులు యువకులతో పెద్ద ఎత్తున పోరాటాలకు నాంది పలుకుతామని వారు హెచ్చరించారు

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp