Saturday, June 27, 2026
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్‌లో సైబర్ క్రైమ్ నియంత్రణకు కొత్త చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ క్రైమ్ నియంత్రణకు కొత్త చర్యలు

-

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అరికట్టేందుకు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, సైబర్ నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ నేరాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలు, వృద్ధులపై లైంగిక దాడుల కేసులు పెరిగిపోతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ, సభ్య సమాజం ఈ అంశం మీద సిగ్గుపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ దాడుల్ని అరికట్టేందుకు సమాజంలో అవగాహన ఏర్పరచడం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీజీపీ సూచించారు.

గంజాయి నిర్మూలనకు ఈగల్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిందని డీజీపీ చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గంజాయి మూలాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల పై పోరాటంలో పోలీసుల పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని చెప్పారు.

రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు కూడా పెద్ద ప్రాధాన్యం పొందుతోంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకారం, టెక్నాలజీ సాయంతో నేరాలు నియంత్రించేందుకు బ్లాక్ స్పాట్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్చి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp