Saturday, June 27, 2026
HomeTelanganaKhammamసత్తుపల్లి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

సత్తుపల్లి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

-

సత్తుపల్లి నియోజకవర్గం లో ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి మండలం గౌరీగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల అభివృద్ధికి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పెనుబల్లి మండలంలో 54 లక్షల ఈజీఎస్ నిధులతో 10 కాటిల్ షెడ్లు, 33 నర్సరీలు, 10 నాడపు కంపోస్ట్ యూనిట్లకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయంలో నాణ్యతను మెరుగుపరచడానికి ఈ నాడపు కంపోస్ట్ యూనిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

కల్లూరు మండలంలో ఒక కోటి 50 లక్షల నిధులతో కొత్త ఎర్రబోయినపల్లి గ్రామంలో 18 లక్షలతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 130 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెప్పారు.

ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పెనుబల్లి ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp