Saturday, June 27, 2026
HomeInterNationalకీవ్‌లో భారత ఔషధ గోదాంపై క్షిపణి దాడి కలకలం

కీవ్‌లో భారత ఔషధ గోదాంపై క్షిపణి దాడి కలకలం

-

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఇటీవల భారతీయ ఔషధ సంస్థ ‘కుసుమ్ ఫార్మా’కి చెందిన గిడ్డంగిపై క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ దాడిలో విస్తృతంగా నష్టం వాటిల్లింది. పిల్లలు, వృద్ధుల కోసం నిల్వ చేసిన ఔషధాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కీవ్‌లోని ప్రాసిక్యూటర్ జనరల్ క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దాడిపై రష్యా భారత్‌లో ఉన్న తమ కార్యాలయం స్పందించింది. ఈ దాడి రష్యా కారణంగా జరిగిందనే వాదన తప్పుబట్టింది. అది ఉక్రెయిన్ క్షిపణే అయి ఉండవచ్చని పేర్కొంది. భారత సంస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. మాస్కో నుంచి వచ్చిన ఈ ప్రకటనపై ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది.

ఒక నేరస్థుడు తన నేరాన్ని అంగీకరించడా? అని ఉక్రెయిన్ ఎంబసీ విమర్శించింది. ఉగ్రవాద చర్యలను సమర్థించడమే రష్యా చేస్తున్న వ్యవహారమని ఆరోపించింది. మాస్కో దాడులు పొరపాటున జరిగాయని చెప్పడం హాస్యాస్పదమని, దీనిని అమెరికా కూడా నమ్ముతుందంటూ ఎద్దేవా చేసింది. రష్యా నమ్మదగిన విధంగా స్పందించలేదని పేర్కొంది.

రష్యా సాయుధ బలగాలు భారత ఔషధ సంస్థలపై దాడి చేయలేదని, తమ లక్ష్యం సైనిక స్థావరాలేనని రష్యా రాయబార కార్యాలయం మళ్లీ స్పష్టం చేసింది. భారత్‌తో స్నేహ సంబంధాలున్నాయి కాబట్టి ఇలాంటి ఆరోపణలు తగవని పేర్కొంది. మరోవైపు, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రష్యా–ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp