Saturday, June 27, 2026
HomeAndhra Pradeshగుంటూరులో మాలల మహాగర్జనకు కోదాడ సర్పంచ్ పిలుపు

గుంటూరులో మాలల మహాగర్జనకు కోదాడ సర్పంచ్ పిలుపు

-

ఈ నెల 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరులో లక్షలాది మాలలతో మాలల మహాగర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోదాడ సర్పంచ్ బూర్తి నాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ, క్రిమిలేయర్ నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం జరుగుతున్న ఈ మహాగర్జనలో లక్షలాదిగా పాల్గొనాలని, ఈ కార్యక్రమం భవిష్యత్తు కోసం కీలకమని నాని వివరించారు.

కరపత్రాలను విడుదల చేసిన ఈ కార్యక్రమంలో శివకోటి రాజు, బత్తిన అచ్చారావు, నక్క నాగు, శివకోటీ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాగర్జన మాలల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని నాయకులు తెలిపారు.

అంబేద్కర్ ఆశయాలను నిజం చేసే ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ప్రతి మాలుడి బాధ్యత అని నాని పిలుపునిచ్చారు. గుంటూరు సభ ద్వారా సమాజంలో తగిన మార్పులు తీసుకురావాలని, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని మాల నేతలు కోరారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp