Saturday, June 27, 2026
HomeAndhra Pradeshబొత్సకు జనసేన నేత కృష్ణవేణి గట్టి కౌంటర్

బొత్సకు జనసేన నేత కృష్ణవేణి గట్టి కౌంటర్

-

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మొరకముదాం మండల జనసేన ఇన్‌చార్జ్ రౌతు కృష్ణవేణి, బొత్స సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యార్థులకు ఏం చేశారని నిలదీశారు. కూటమి ప్రభుత్వంపై ఆయన చేసే వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉన్నాయన్నారు.

బొత్స సత్యనారాయణ మంత్రి పదవిలో ఉండగా విద్యా రంగం ఎంత మేరకు అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా విద్యార్థులను తీవ్ర అవస్థలకు గురి చేశారని ఆరోపించారు. నేడు జనసేన-తెలుగుదేశం కూటమిపై విమర్శలు చేయడం సరికాదని కౌంటర్ ఇచ్చారు.

బొత్స కుటుంబ పాలన వల్ల చీపురుపల్లిలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని కృష్ణవేణి ఆరోపించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మంత్రిగా బాధ్యత తప్పించుకున్నారని విమర్శించారు.

జనసేన కూటమి పాలనలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేసి, యువత భవిష్యత్తును మెరుగుపరచడానికి కృషి చేస్తామని కృష్ణవేణి స్పష్టం చేశారు. ప్రజలు బొత్స మాటలను నమ్మే స్థితిలో లేరని, జనసేన అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలిపారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp