Saturday, June 27, 2026
HomeAndhra Pradeshకోవూరులో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ లోన్ల ఇంటర్వ్యూలు

కోవూరులో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ లోన్ల ఇంటర్వ్యూలు

-

కోవూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు లోన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీడీవో శ్రీహరి సమక్షంలో బ్యాంకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి, లబ్ధిదారుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, తమ పత్రాలను అధికారులకు సమర్పించారు.

ఎంపీడీవో శ్రీహరి మాట్లాడుతూ, లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, బ్యాంకులకు పంపించామని తెలిపారు. బ్యాంకులు లబ్ధిదారుల యూనిట్ విలువ, అవసరమైన లోన్ మొత్తం పరిశీలించనున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులతో సమర్పించాల్సిందిగా సూచించారు.

బ్యాంకు అధికారులు లబ్ధిదారుల సిబిల్ వెరిఫికేషన్, ట్రాక్ రికార్డులను పరిశీలించి, అర్హులైన వారిని తుది జాబితాలో చేర్చనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పది రోజులలో ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.

కోవూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించేందుకు ఆలస్యం చేయొద్దని ఎంపీడీవో శ్రీహరి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp