Saturday, June 27, 2026
HomeAndhra Pradeshమెంటాడలో ఎంపీడీవో ప్రమీల గాంధీ పర్యటన

మెంటాడలో ఎంపీడీవో ప్రమీల గాంధీ పర్యటన

-

విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలంలో సోమవారం మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ పర్యటించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా లోతుగెడ్డ, ఆండ్ర జగన్నాధపురం తదితర గ్రామాలలో పర్యటించారు. పొంగుతున్న వాగులను పరిశీలించారు. ఏ ఒక్కరు కూడా ప్రమాదకరంగా ఉన్న వాగులను దాటవద్దని కోరారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి వరదల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. మంగళవారం జరిగే ఆండ్ర సంతకు ఇతర ప్రాంతాల నుంచి గిరిజనులు ఎక్కువగా రానుండడంతో ముందస్తు జాగ్రత్తలలో భాగంగా సంతను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో త్రివిక్రమరావు, పంచాయతీ ఆఫీసర్ విమల కుమారి,టిడిపి మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు, గొర్రెల ముసలి నాయుడు, మన్నెపురి రామచంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp