Saturday, June 27, 2026
HomeNationalపాస్ పోర్ట్ సేవలకు ఐదు రోజుల విరామం

పాస్ పోర్ట్ సేవలకు ఐదు రోజుల విరామం

-

పాస్ పోర్ట్ సేవా పోర్టల్ నిర్వహణ (మెయింటనెన్స్) సంబంధిత కార్యకలాపాల వల్ల పాస్ పోర్ట్ సేవలకు అంతరాయం కలగనుందని కేంద్రం వెల్లడించింది. పాస్ పోర్ట్ సేవలు ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండవని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేయనున్నట్లు వివరించింది. రీషెడ్యూల్ చేసిన వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. గురువారం (ఆగస్టు 29) రాత్రి 8 గంటల నుంచి ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్ అవుతాయని చెప్పారు.

సెప్టెంబర్ 2 వరకు కొత్త అపాయింట్ మెంట్లు బుక్ చేసుకోవడం వీలు కాదన్నారు. కొత్తగా పాస్ పోర్ట్ తీసుకోవడానికి, పాత పాస్ పోర్ట్ రెన్యూవల్ తదితర సేవలు పొందేందుకు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవడానికి ఈ ఆన్ లైన్ సేవా పోర్టల్ ఉపయోగపడుతుంది. పాస్ పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ కారణంగా గంటల తరబడి ఎదురుచూసే పనిలేకుండా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అపాయింట్ మెంట్ బుక్ చేసుకుని నేరుగా ఆ సమయానికి వెళ్లవచ్చు. కాగా, సాంకేతిక నిర్వహణలో భాగంగా ఐదు రోజుల పాటు ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులో లేకపోవడంతో పాస్ పోర్ట్ సేవలు పొందాలనుకునే వారికి కొంత అసౌకర్యం తప్పదని అధికారులు తెలిపారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp