Saturday, June 27, 2026
HomeInterNationalVenezuela | శిథిలాల కింద 48 గంటల పోరాటం.. సజీవంగా బయటపడిన 18 రోజుల చిన్నారి

Venezuela | శిథిలాల కింద 48 గంటల పోరాటం.. సజీవంగా బయటపడిన 18 రోజుల చిన్నారి

-

Venezuela: వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం వేలాది కుటుంబాలను విషాదంలో ముంచెత్తింది. క్షణాల్లో కూలిపోయిన భవనాలు, కోల్పోయిన ప్రాణాలు, నిరాశ్రయులైన ప్రజలు దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టాయి. అయితే ఈ విషాదంలోనూ కొన్ని ఘటనలు మానవత్వంపై ఆశను సజీవంగా ఉంచుతున్నాయి. అలాంటి ఓ హృదయాన్ని హత్తుకునే సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.

భూకంపం సంభవించిన దాదాపు 48 గంటల తర్వాత శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతుండగా, సహాయక బృందాలకు ఓ పసికందు ఏడుపు వినిపించింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తూ లోపలికి చేరుకున్నారు. కొద్ది సేపటి ఉత్కంఠభరిత ప్రయత్నాల అనంతరం కేవలం 18 రోజుల వయస్సున్న చిన్నారిని సజీవంగా బయటకు తీసుకువచ్చారు.

బిడ్డ కోసం ఆందోళనతో ఎదురుచూస్తున్న తండ్రికి చిన్నారిని అప్పగించగానే ఆయన కన్నీళ్లు ఆపుకోలేక గుండెలకు హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. రెస్క్యూ సిబ్బంది చేసిన సాహసోపేత ప్రయత్నాలను స్థానికులు చప్పట్లతో అభినందించారు.

చిన్నారిని రక్షించిన సుమారు 90 నిమిషాల తర్వాత అదే శిథిలాల కింద చిక్కుకున్న ఆమె తల్లిని కూడా సురక్షితంగా బయటకు తీశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రాణాలతో బయటపడటాన్ని స్థానికులు అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ బృందాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

chhattisgarh police chase truck driver after fatal accident involving 11 year old girl

Chhattisgarh | మద్యం మత్తులో బీభత్సం.. రెండుగంటల ఛేజింగ్ తర్వాత డ్రైవర్ అరెస్ట్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఓ ట్రక్కు ప్రమాదంతో మొదలైన ఘటన, పోలీసుల ఛేజింగ్‌తో ఉత్కంఠభరిత మలుపులు తిరిగింది. మద్యం మత్తులో ట్రక్కు నడిపిన ఓ డ్రైవర్ 11 ఏళ్ల బాలికను ఢీకొట్టి అక్కడి నుంచి...
- Advertisement -
Chat on WhatsApp