Saturday, June 27, 2026
HomeTelanganaCM Revanth Reddy | వర్షాలపై అప్రమత్తం అయిన ప్రభుత్వం..  అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy | వర్షాలపై అప్రమత్తం అయిన ప్రభుత్వం..  అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

-

CM Revanth Reddy: భారీ వర్షాల ప్రభావం కొనసాగుతున్నందున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ CURE ప్రాంతంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ, హై అలర్ట్ ప్రకటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయన ఆదేశించారు. వర్షాల కారణంగా నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తక్షణ, సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వాతావరణ శాఖ అందించే తాజా వర్ష సూచనలను ఆధారంగా తీసుకుని ముందస్తు ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా నీరు నిలిచే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, సమస్యాత్మక జోన్లను గుర్తించి అక్కడ అత్యవసర బృందాలను ముందుగానే మోహరించాలని ఆదేశించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, GHMC, HYDRAA, విద్యుత్ శాఖ, వాటర్ బోర్డ్ వంటి అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

చీఫ్ సెక్రటరీ, డీజీపీ, CURE ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో పాటు సీనియర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని, అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడటం, విద్యుత్ అంతరాయాలు నివారించడం, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, వర్ష పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp